గుంటూరులో మీడియాపై భూమా అనుచరుల దాడి, ఫిర్యాదు
గుంటూరు: గుంటూరు లో మీడియా ప్రతినిధుల పై నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. కెమెరాలు పగులగొడతామని భూమా అనుచరులు వీరంగం సృష్టించారు.
భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులు వీరంగం సృష్టిస్తోన్నా టిడిపి నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. గుంటూరు డొంక రోడ్డు లో వినాయకుడి మండపానికి వచ్చిన మంత్రి భూమా అఖిల ప్రియ, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మనంద రెడ్డి మీడియా కవరేజ్ వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు.
భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై మీడియా ప్రతినిధులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీస్ యంత్రాంగం. ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు.
జర్నలిస్టులపై దాడికి దిగిన భూమా బ్రహ్మనందరెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి.