నంద్యాల మాదే, కాకినాడా మాదే: టీడీపీ నేత కళా వెంకట్రావు
నంద్యాలలో బుధవారం జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాలా మాదే, కాకినాడా మాదే..’ అన్నారు.
కర్నూలు: నంద్యాలలో బుధవారం జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'జగన్ భాష నచ్చని ప్రజలు టీడీపీకే ఓటు వేశారు. టీడీపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నంద్యాలా మాదే, కాకినాడా మాదే..' అన్నారు.
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ తరపున మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు.
వైసీపీ నేతలు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది : భూమా మౌనిక
నంద్యాల ఉపఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేశారని, తన తండ్రి భూమా నాగిరెడ్డి ఆత్మ శాంతించాలని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారని మంత్రి అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక అన్నారు.
ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 'మా నాన్నగారికి నంద్యాల నియోజకవర్గం ఘన నివాళి అర్పించబోతోంది. ఆయన ఆత్మ శాంతించబోతోంది. దీని కోసమే, మేమందరం వేచి చూస్తున్నాం. అలాగే, రాబోయే కాలంలో బ్రహ్మానందరెడ్డి అన్న కూడా ఎంతో మంచి పనులు చేస్తూ, నాన్న పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను..' అని అన్నారు.