వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌చారంలోకి నంద‌మూరి వార‌సురాళ్లు : మంగ‌ళ‌గిరి లో బ్రాహ్మ‌ణి..విశాఖ‌లొ తేజ‌స్విని : సీన్ మారుతుందా.

|
Google Oneindia TeluguNews

ఏపి ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొత్త స్టార్లు. టిడిపి లోని నంద‌మూరి..నారా కుటుంబాల్లోని మ‌హిళలు ప్ర‌చారం ప‌ర్వంలోకి దిగా రు. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు కు మ‌ద్ద‌తుగా కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇక‌, బాల‌కృష్ణ మ‌ద్ద‌తుగా హిందూపురంలో వ‌సుంధ‌ర ప్ర‌చారం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టిడిపి స్టార్ క్యాంపెయిన‌ర్లుగా ఎన్టీఆర్ మ‌న‌మ‌రాళ్లు రంగంలోకి దిగారు

Nara and Nandamuri Family in election campaign...Brahmani in Mangalagiri campaign for Lokesh

లోకేష్ కు మ‌ద్ద‌తుగా బ్రాహ్మ‌ణి..
మంగ‌ళ‌గిరి లో లోకేష్ ను ఎలాగైనా ఓడించాల‌ని వైసిపి వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇప్పిటికే ష‌ర్మిళ తో పాటుగా మోహ న్ బాబు వైసిపి అభ్య‌ర్ది ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసారు. బిసి నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకొని అధికా రంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బిసి వ‌ర్గ నేత‌కు స‌ముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని హామీ ఇస్తు న్నారు. లోకేశ్ కు మ‌ద్దతుగా టిడిపి నేత‌లు..బిసి నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. లోకేశ్ మిగిలిన నియోజ‌కవ‌ర్గాల ప్ర‌చా రాన్ని ప‌క్క‌న పెట్టేసి పూర్తిగా మంగ‌ళ‌గిరి పైనే ఫోక‌స్ చేస్తున్నారు. ప్ర‌తీ ఇంటికి వెళ్లి..తాను ఉన్నానంటూ భ‌రోసా ఇస్తు న్నారు. ఇక‌, దీంతో..ఇప్పుడు తాజాగా ప్ర‌చారంలో మ‌రింత జోష్ తెచ్చేందుకు ఇప్ప‌టి దాకా..కుటుంబం..వ్యాపార రంగాల‌కే ప‌రిమిత‌మైన లోకేశ్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి ప్ర‌చార రంగంలోకి దిగుతున్నారు. మంగ‌ళ‌గిరి లో లోకేశ్ కు మ‌ద్దతు గా ప్ర‌చారం చేయాల‌ని నిర్ణ‌యించారు.

విశాఖ‌లో బాల‌కృష్ణ చిన్న కుమార్తె..
ఇక‌, విశాఖ నుండి టిడిపి ఎంపీగా బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు భ‌ర‌త్ పోటీ చేస్తున్నారు. విశాఖ లో ఇప్ప‌టికే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌చారంలో ఉన్నారు. ఇక‌, బాల‌కృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సైతం ప్ర‌చారంలోకి దిగారు. భ‌ర‌త్ ను గెలి పించాల‌ని అభ్య‌ర్దించారు. చంద్ర‌బాబు సైతం విశాఖ లో ఇప్ప‌టికే రెండు విడ‌త‌లుగా ప్ర‌చారం చేసారు. ఈ ఎన్నిక‌ల్లో బాల‌కృష్ణ ఇద్ద‌రు కుమార్తెల‌తో పాటుగా భార్య సైతం ప్ర‌చారంలోనే ఉన్నారు. భ‌ర్త బాల‌కృష్ణ గెలుపు కోసం హిందూ పూర్ లో దాదాపు 20 రోజులుగా ప్ర‌చారంలోనే ఉన్నారు. ఇక‌, ఎప్పుడూ రాజ‌కీయాల్లోకి రాని చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ నేశ్వ‌రి సైతం ఈ సారి ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంటున్నారు. కుప్పం లోని నేత‌ల‌తో నిత్యం ట‌చ్ లో ఉంటూ అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టికప్పుడు తెలుసుకుంటున్నారు. అక్క‌డ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపుతున్నారు. చంద్ర‌బాబును గెలి పించాల‌ని అభ్య‌ర్దిస్తున్నారు.

English summary
Minister Lokesh wife Brahmani started election campaign for Lokesh in mangalagiri segment. Already Balakrishna wife Vasundhara is in Hindupur campaign. Chandra Babu wife Bhuvaneswari looking responsibilities of Kuppam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X