నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాలంటీర్ల ముసుగులో మైనర్లపై లైంగికదాడులా..? మృగాళ్లపై చర్యలేవీ..? జగన్‌ సర్కార్‌పై లోకేశ్ ఫైర్..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో వారంలో మైనర్లపై రెండు లైంగికదాడులు జరిగిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మృగాళ్లపై జగన్ సర్కార్ కఠిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఘటన తర్వాత జరిగిన... నెల్లూరు ఇన్సిడెంట్ గురించి లోకేశ్ ట్వీట్ చేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని లోకేశ్ ధ్వజమెత్తారు.

నెల్లూరు జిల్లా పెద్దరాజుపాలెంలో 9 ఏళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. గ్రామ వాలంటీర్ లైంగికదాడి చేయడం కలిచి వేసింది. ఇది సమాజం తలదించుకొనే ఘటన అని లోకేశ్ ట్వీట్ చేశారు. వాలంటీర్ల ముసుగులో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడటం ఏంటీ అని ప్రశ్నించారు. సదరు మృగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

nara lokesh angry on ys jagan government

Recommended Video

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!

21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం చేస్తామని జగన్ సర్కార్ ప్రగాల్బాలు పలికిందని లోకేశ్ ఫైరయ్యారు. కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదన్నారు. దిశ పోలీసు స్టేషన్లు కూడా ప్రచార ఆర్భాటమే అన్నారు. జగన్ పాలనలో మహిళలకు రక్షణ లేదు అని.. మైనర్ బాలికలపై లైంగికదాడులు జరుగుతున్న చర్యలు తీసుకోవడం లేదని గుర్తుచేశారు.

English summary
tdp leader nara lokesh angry on ys jagan government for rape incidents no actions in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X