వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌వి నీచ రాజకీయాలు, విజ్ఞత లేకుండా ఇలానా: లోకేష్ ఫైర్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో గొప్ప నేతను కోల్పోయామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో సంతాప తీర్మానానికి

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో గొప్ప నేతను కోల్పోయామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో సంతాప తీర్మానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాకపోవడం శోచనీయమని అన్నారు.

వైసీపీకి కనీస విజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైసీపీ నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని లోకేష్ మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధికి వారిచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు.

కాగా, భూమా సంతాప తీర్మానానికి వైయస్ జగన్ రాకపోవడంపై భూమా అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

వైసీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని ఆమె తెలిపారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి, పార్టీకి తన తండ్రి అండగా ఉన్నారని చెప్పారు. జగన్.. కనీసం సభకు వచ్చి సంతాపం కూడా తెలపకపోవడం తననెంతో బాధకు గురిచేసిందని అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

English summary
TDP leader Nara lokesh on Tuesday fired at YS Jagan for not attending assembly Sessions, to condolence to Bhuma Nagireddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X