లూసియానా గవర్నర్ జిందాల్తో లోకేష్(ఫొటోలు)
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ బుధవారం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్తో సమావేశమయ్యారు. సమావేశ వివరాలను తెలుగుదేశం మీడియా కమిటీ ఛైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ మీడియాకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పారదర్శక పాలనను, నూతన పారిశ్రామిక విధానాన్ని గవర్నర్ జిందాల్కు లోకేష్ వివరించారు. ఏపి, లూసియానాల మధ్య వర్తక, వాణిజ్యాలకు గల అవకాశాలను చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, వనరులు పుష్కలంగా ఉన్నాయనీ, ఏపి ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులను సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
Met
Louisiana
Governor
@BobbyJindal.
Discussed
on
several
areas
of
potential
cooperation
In
Trade
&
investments.
pic.twitter.com/zhjWYFb9uE
—
Lokesh
Nara
(@naralokesh)
May
13,
2015
ఈ సందర్భంగా బాబీ జిందాల్ మాట్లాడుతూ.. ఏపి సిఎంగా చంద్రబాబునాయుడు తిరిగి ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.