విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవర్ చూపిస్తారనుకుంటే..: పవన్ కళ్యాణ్‌పై లోకేష్ సెటైర్లు, ‘జగన్ దుప్పటి కప్పుకుని..’

|
Google Oneindia TeluguNews

కడప: కేంద్ర ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ మోసం చేసినా ఏపీని సీఎం చంద్రబాబు అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు.

<strong>జగన్‌పై దాడి కుట్రే, ఇవి చాలవా? శ్రీనివాస్ రూ.కోటితో భూమి బేరమాడాడు: రోజా ఆరోపణలు</strong>జగన్‌పై దాడి కుట్రే, ఇవి చాలవా? శ్రీనివాస్ రూ.కోటితో భూమి బేరమాడాడు: రోజా ఆరోపణలు

జగన్ దొంగ పుత్రుడు.. పవన్ దత్త పుత్రుడు

జగన్ దొంగ పుత్రుడు.. పవన్ దత్త పుత్రుడు

మంగళవారం ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట దీక్షలో లోకేష్ మాట్లాడుతూ.. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ దీక్ష చేపడితే.. ఆయనపై ఐటీ దాడులు చేయించారని ఆరోపించారు. బీజేపీకి జగన్ దొంగ పుత్రుడైతే.. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీపై వీరిద్దరూ ఒక్క విమర్శ కూడా చేయలేదని అన్నారు.

జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ..

జగన్మోహన్ రెడ్డి డ్రామా కంపెనీ..

బీజేపీ అంటే భారతీయ జగన్, పవన్ కళ్యాణ్ పార్టీ అని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ పార్టీ ఒక డ్రామా కంపెనీ అని విమర్శించారు. వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు, విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఇవన్నీ డ్రామాలే అని లోకేష్ అన్నారు.

ఆస్పత్రిలో జగన్ దుప్పటి కప్పుకుని..

ఆస్పత్రిలో జగన్ దుప్పటి కప్పుకుని..

విశాఖ విమానాశ్రయంలో నవ్వుకుంటూ వెళ్లిన జగన్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నవ్వుకుంటూ, చేతులు ఊపుతూ వెళ్లారని లోకేష్ చెప్పారు. మూడు గంటలసేపు బాగానే ఉన్న జగన్.. ఆస్పత్రిలో దుప్పటి కప్పుకుని.. ఫొటోలు బయటికి పంపి డ్రామాకు తెరతీశారని లోకేష్ ఆరోపించారు.

పవర్ స్టార్ అనుకుంటే..

పవర్ స్టార్ అనుకుంటే..

కవాతులు చేస్తున్న పవన్ కళ్యాణ్.. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించేందుకు ఆరు రోజుల తర్వాత వెళ్లారని లోకేష్ మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్‌గా కేంద్రాన్ని నిలదీస్తారనుకుంటే.. చివరకు సైలెంట్‌గా ఉండిపోయారని ఎద్దేవా చేశారు.

బాబును అందుకోలేకపోతున్నాం

బాబును అందుకోలేకపోతున్నాం

పని విషయంలో సీఎం చంద్రబాబు స్పీడును అందుకోవడం ఎవరి వల్ల కావడం లేదని అన్నారు. ఏపీ భవిష్యత్ బాగుపడాలంటే మరోసారి చంద్రబాబును గెలిపించాలని మంత్రి లోకేష్ అన్నారు. టీడీపీకి మరోసారి ఘన విజయాన్ని కట్టబెట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు.

English summary
Andhra Pradesh minister Nara Lokesh takes on at YSRCP president YS Jaganmohan Reddy and Janasena president Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X