నరసింహ ఆగ్రహం: బాబు కాన్వాయ్కి అడ్డంగా కారు పెట్టారు!, ఎందుకంటే?
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ నరసింహ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డంగా కారును నిలపడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి తిరుపతి వచ్చిన చంద్రబాబు.. స్థానిక పద్మావతి గెస్ట్ హౌజ్లో బస చేశారు. శనివారం ఉదయానికే చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో గెస్ట్ హౌస్కు వద్దకు చేరుకున్నారు.
అప్పటికే మిగితా వారిని అనుమతించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ తర్వాత వచ్చిన తుడా ఛైర్మన్ నరసింహను అడ్డుకుంది. అందర్నీ పంపించి తనను మాత్రం అడ్డుకోవడంతో నరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీతో కాదు.. చంద్రబాబుతోనే తేల్చుకుంటానంటూ సెక్యూరిటీని హెచ్చరించారు.
ఆ తర్వాత తన కారును తీసుకొచ్చి.. ముఖ్యమంత్రి కాన్వాయ్కి అడ్డంగా నిలిపారు. తిరుపతి నుంచి నంద్యాలకు బయలుదేరాల్సిన సమయం కావడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. తుడా ఛైర్మన్ వాహనాన్ని పక్కకు తరలించారు. ఆ తర్వాత చంద్రబాబును నరసింహ కలిసినట్లు తెలిసింది.