వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఏపీకి మోసం చేశారు, తెలిసీ వెంకయ్య మౌనం: గుత్తాకు జైరాం ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ బుధవారం అన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం విభజన చట్టానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఏపీని తీవ్రంగా మోసం చేశారన్నారు. మోడీది సెల్ఫ్‌లెస్ ప్రభుత్వమన్నారు. ఆయన సెల్ఫీ ప్రధాని అని ఎద్దేవా చేశారు.

Narendra Modi Cheating AP People: Jairam

ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో ఓడిన మాకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లు ఓ సంజీవిని అన్నారు. మోడీ ఏం చేయలేదో తాము ప్రజలకు చెబుతామన్నారు. ప్రభుత్వాన్ని ఆయన వన్ మాన్ షోగా మార్చారని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పైన యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. కేంద్ర కేబినెట్ బైపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ సర్కారుకు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు.

తెలంగాణ ఎంపీ గుత్తా లేఖపై...

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ పైన జైరామ్ స్పందించారు. గుత్తా లేఖతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఆ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

English summary
Narendra Modi Cheating AP People: Jairam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X