పెళ్ళికి ముందే అమ్మాయి ఆంక్షలు: తట్టుకోలేక యువకుడిలా...
పెళ్ళికి ముందే అమ్మాయి తరపువారు ఆంక్షలు పెట్టడంతో పెళ్ళిని రద్దు చేసుకోవాలని భావించాడు ఓ యువకుడు. అయితే ఈ పెళ్ళి రద్దు విషయమై అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత
మంగళగిరి: పెళ్ళికి ముందే అమ్మాయి తరపువారు ఆంక్షలు పెట్టడంతో పెళ్ళిని రద్దు చేసుకోవాలని భావించాడు ఓ యువకుడు. అయితే ఈ పెళ్ళి రద్దు విషయమై అమ్మాయి తరపు వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో గురువారం నాడు నరేష్ అనే యువకుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. యడ్ల నరేష్ కు విజయవాడకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మాయి పెళ్ళి బాధ్యతను ఆమె పిన్ని తీసుకొంది.
నరేష్ విజయవాడలోని కోకా కోలా కంపెనీలో మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అయితే అమ్మాయికి ఏం కావాలో ప్రతి రోజూ ఫోన్ చేసి అమ్మాయి పిన్ని ఫోన్ చేసి ఆంక్షలను విధించేది.
ఈ ఆంక్షలను భరించలేక వివాహన్ని రద్దు చేసుకొందామని నరేష్ ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన విషయమై వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయి పిన్ని నరేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పెళ్ళి విషయమైనందున పోలీసులు రెండు కుటుంబాలు మాట్లాడుకోవాలని సూచించారు.
ఈ మేరకు పెళ్ళికి ముందే తమను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించారనే ఆవేదనతో నరేష్ ఈ నెల 11వ, తేదిన పెదపూడి వచ్చారు.గురువారం నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.