వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిసి టీవీ ఫుటేజ్ చూడండి, నయీం గురించి మాట్లాడా: అచ్చెన్నాయుడిపై నట్టికుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తనను ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అనడంపై తెలుగు సినీ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని, ఆయనను తాను ఎప్పుడూ చూడలేదని అచ్చెన్నాయుడు అన్న విషయం తెలిసిందే. దీనిపై నట్టి కుమార్ బుధవారం మీడియా సమావేశంలో స్పందించారు.

నయీంతో మంత్రి అచ్చెన్నాయుడు లింకు: సవాల్ విసిరిన నట్టి, బాలకృష్ణను లాగారు

మే 17వ తేదీన స్పైస్ జెట్ విమానంలో తామిద్దరం విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చామని, విమాన ప్రయాణ సమయంలో నయీంకు సంబంధించిన వ్యవహారాలపై మంత్రితో మాట్లాడానని ఆయన చెప్పారు. సిసి టీవీ ఫుటేజీ బయటకు తీస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.

Natti Kumar once again challenges Acchennaidu

ఎపి మంత్రి అచ్చెన్నాయుడు తనను చూడలేదని అబద్దాలాడుతున్నారని ఆయన అన్నారు. మంత్రిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్ప్ారు .గ్యాంగస్టర్ నయీం, మంత్రి అచ్చెన్నాయుడి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు

'నయీమ్‌తో అచ్చెన్నాయుడికి సంబంధాలు: సినీ నిర్మాతలతో కూడా'

టిడిపి నేత జగ్గిరెడ్డి ఉత్తరాంధ్రలో నాలుగే క్యాంటిన్లు ఉన్నాయని చెబుతున్నారని అంటూ అంతకన్నా ఎక్కువ క్యాంటీన్లు ఉంటే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారా అని ఆయన అడిగారు. టిడిపి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, ఆయన కుమారుడు చైతన్యరెడ్డిలపై కూడా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Telugu film director Natti Kumar retaliated Andhra Pradesh minister Acchannaidu's comments on his allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X