పవన్ కళ్యాణ్ టీ వ్యతిరేకి: నాయని, శిఖండి: దేశపతి
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత నాయని నర్సింహారెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ఆనయ విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పనికి రాడని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పనికి రాడని అన్నారు. జనసేనకు ప్రణాళిక లేదు, కమిటీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో ఉంటూ తెలంగాణను తిడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. సెటిలర్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసారు. తమ పార్టీ కేవలం ఆంధ్రా పెట్టుబడిదారులకు మాత్రమే వ్యతికేరమని ఆయన అన్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సినిమా శిఖండి పవన్ కళ్యాణ్ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ రోజు నిజామాబాద్ బిజెపి సభలో పవన్ కళ్యాణ్తో మాట్లాడించి బిజెపి నేతలు తెలంగాణ ప్రజలను అవమానించారని ఆయన అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థితో కలిసి పవన్ కళ్యాణ్ మంగళవారంనాడు నిజామాబాద్ ప్రచార సభలో పాల్గొన్న విషయం తెలిసిందే.