పెళ్ళైన రెండు రోజులకే వరుడు ఇలా...పెళ్ళి ఇంట్లో విషాదం, కారణమదేనా
పెళ్ళేన రెండు రోజులకే నవవరుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది . శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ఈ నెల రెండవ తేదిన వివాహం చేసుకొన్నాడు. శనివారం నాడు ఉదయం ఆత్మహత్య చేసుకొన్నాడు.
తూర్పుగోదావరి :పెళ్ళై రెండు రోజులే...ఏమైందో తెలియదు ఆ పెళ్ళింట్లో మాత్రం విషాదం నిండింది. పెళ్ళి చేసుకొన్న రెండు రోజులకే వరుడు ఉరివేసుకొని
ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.
తూర్పుగోదావరి జిల్లా మురమండ గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్ రావు మహబూబాబాద్ లో స్టీట్ షాపు నిర్వహిస్తున్నాడు. అతనికి ఈ నెల రెండవ తేదిన వివాహం జరిగింది.
కొత్త దంపతులు అన్నవరం వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శిం,చుకొన్నారు. శనివారం నాడు ఉదయం శ్రీనివాస్ రావు ఆత్మహత్య చేసుకొన్నాడు.
శ్రీనివాస్ రావు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడో కారణాలు మాత్రం తెలియరాలేదు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు
చేస్తున్నారు.ఈ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే వివాహమైన రెండు రోజులకే వరుడు ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.