రౌడీషీటర్ సుబ్బు హత్య కేసులో కొత్త ట్విస్ట్: 9మంది పాత్ర
విజయవాడ: హత్యకు గురైన బెజవాడ రౌడీషీటర్ కేసులో మరో ట్విస్ట్. సుబ్బును హత్య చేసింది తొమ్మిది మంది వైసీపీ నాయకులు అని విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
ఎవరీ సుబ్బు?: పగ తీరకపోతే మమ్మల్ని కూడా చంపమన్న భార్య.. హత్యతో ఉలిక్కిపడ్డ బెజవాడ..
ఈ హత్యతో కాట్రగడ్డ శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సుబ్బు హత్యలో ప్రధాన సూత్రధారి వైసీపీ నాయకుడు సురేంద్ర అని చెప్పారు.
కాగా, ఇటీవల సుబ్బు హత్యతో బెజవాడు ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై అతనిని ప్రత్యర్థులు కిరాతకంగా నరికి చంపారు.
ఈ హత్యతో విజయవాడ టీడీపీ యూత్ విభాగం అధ్యక్షుడు శ్రీను హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన హస్తం లేదని పోలీసులు తెలిపారు.
Comments
English summary
New twist in Rowdy Sheeter Subbu murder case.
Story first published: Friday, December 15, 2017, 15:33 [IST]