కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లయి 24గంటలు గడవకముందే..: రాజంపేటలో వధువు మిస్సింగ్..

|
Google Oneindia TeluguNews

కడప: వివాహమై 24గంటలు కూడా గడవలేదు, వధువు అదృశ్యమైంది. సాయంత్రం వేళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతూ కనిపించిన వధువు.. ఒక్కసారిగా అదృశ్యమవడంతో ఇరు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాల సమీపంలోని వినాయక్‌నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. వినాయక్‌నగర్‌లో నివసించే రమణమ్మ.. కుమార్తె సునీతకు ఈ నెల 25న వివాహం జరిపించింది. కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్యతో సునీత పెళ్లి జరిగింది. పెళ్లి అనంతరం నవ దంపతులను అదే రోజు సాయంత్రం అత్తిరాలకు తీసుకొచ్చారు.

newly wedded woman missing in rajampeta

రాత్రి సమయంలో ఇంటి బయట అటు ఇటు తిరుగుతూ కనిపించిన సునీత.. ఒక్కసారిగా అదృశ్యమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆదివారం సాయంత్రం మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

English summary
Sunita, A newly wedded woman was missed same day after marriage in Rajampeta. Her mother lodged a complaint in Police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X