స్నేక్గ్యాంగ్పై చర్యలకు మహిళల ఆందోళన(పిక్చర్స్)
హైదరాబాద్: అరాచకాలకు పాల్పడుతున్న స్నేక్గ్యాంగ్పై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, వారికి సహకరించిన పోలీసులను డిస్మిస్ చేయాలని షాహిన్ ఉమెన్స్ రిసోర్స్ సంస్థ అధ్యక్షురాలు జమీలా నిషాత్ డిమాండ్ చేశారు. బుధవారం మొగల్పురా ఉర్దూఘర్లో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఖమర్ జమీల, మిధున్, ప్రొఫెసర్ ఎహెసాన్ ఖాన్ మాట్లాడారు.
షాహిన్నగర్లో ఓ యువతిని స్నేక్గ్యాంగ్ పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం మహిళలు ఉర్దూఘర్ నుంచి చార్మినార్ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జమీలా నిషాత్ మాట్లాడుతూ.. స్నేక్గ్యాంగ్ తోపాటు పహిల్వాన్లు అక్కడ నివసించే పేదలను పాములతో భయభ్రాంతులకు గురి చేసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, అక్కడ రెండు సంవత్సరాలుగా నమోదైన కేసులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆందోళన
అరాచకాలకు పాల్పడుతున్న స్నేక్గ్యాంగ్పై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, వారికి సహకరించిన పోలీసులను డిస్మిస్ చేయాలని షాహిన్ ఉమెన్స్ రిసోర్స్ సంస్థ అధ్యక్షురాలు జమీలా నిషాత్ డిమాండ్ చేశారు.
ఆందోళన
బుధవారం మొగల్పురా ఉర్దూఘర్లో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఖమర్ జమీల, మిధున్, ప్రొఫెసర్ ఎహెసాన్ ఖాన్ మాట్లాడారు.
ఆందోళన
షాహిన్నగర్లో ఓ యువతిని స్నేక్గ్యాంగ్ పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆందోళన
అనంతరం మహిళలు ఉర్దూఘర్ నుంచి చార్మినార్ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
ఆందోళన
ఈ సందర్భంగా జమీలా నిషాత్ మాట్లాడుతూ.. స్నేక్గ్యాంగ్ తోపాటు పహిల్వాన్లు అక్కడ నివసించే పేదలను పాములతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన
స్నేక్గ్యాంగ్ తోపాటు పహిల్వాన్లు పాములతో భయభ్రాంతులకు గురి చేసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, అక్కడ రెండు సంవత్సరాలుగా నమోదైన కేసులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఆందోళన
నిందితులకు వత్తాలు పలికే నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఆందోళన
ఈ కార్యక్రమంలో షాహిన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అనురాధ, వందన, షాహెద, సుల్తాన, రేవతితోపాటు సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు.