వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వనజాక్షిపై చింతమనేని దాడి: ఏపీ ప్రభుత్వానికి హెచ్చార్సీ నోటీసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వనజాక్షఇ దాడి ఘటన మీద రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, డిజిపిలకు నోటీసులు ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ కేసును సుమోటోగా తీసుకుంది.

NHRC issues notice to AP government

కాగా, కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి పైన పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇది కలకలం రేపింది. రెవెన్యూ సంఘాలు వనజాక్షికి అండగా నిలిచాయి.

దీనిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ సంఘాలతో చర్చించారు. వనజాక్షి పైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ అనుచరుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనికి ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఈ విషయమై విచారణ సాగుతోంది.

English summary
NHRC issues notice to AP government on Tahasildar Vanajakshi incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X