వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రా సీఎం జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ, యువతకు ఆదర్శం, కర్ణాటక సీఎం కొడుకు కితాబు !

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ పార్టీ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తీసుకున్న ఫోటోలను నిఖిల్ కుమారస్వామి సోషల్ మీడియలో పోస్టు చేశారు. జగన్ మోహన్ కు ధైర్యం ఎక్కువ అని నిఖిల్ కుమారస్వామి కితాబు ఇచ్చారు. మ్యండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తరువాత నిఖిల్ కుమారస్వామి వివిధ రాజకీయ పార్టీల నాయకులను భేటీ అవుతున్నారు.

సీఎం జగన్ తో భేటీ

సీఎం జగన్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ తో ఇటీవల నిఖిల్ కుమారస్వామి భేటీ అయ్యారు. సీఎం జగన్ తో భేటీ అయిన ఫోటోలను నిఖల్ కుమారస్వామి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఇటీవల తాను విజయవాడ వెళ్లి సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ కావడం చాల ఆనందంగా ఉందని నిఖిల్ కుమారస్వామి ఫేస్ బుక్ లో వివరించారు.

కర్ణాటక రాజకీయాలు

కర్ణాటక రాజకీయాలు

కర్ణాటక రాజకీయలపై జగన్ మోహన్ రెడ్డికి ఎక్కువ అవగాహన ఉందని, అక్కడి రాజకీయల గురించి అడిగి తెలుసుకున్నారని నిఖిల్ కుమార్ స్వామి తెలిపారు. జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం చాల సంతోషంగా ఉందని నిఖిల్ కుమారస్వామి తెలిపారు.

జగన్ జీవితం

జగన్ జీవితం

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి అభిమానుల దగ్గర అన్నా అని పిలిపించుకున్నారని, ఆయన్ను చాల దగ్గరగా చూడటం చాల సంతోషంగా ఉందని నిఖిల్ కుమారస్వామి వివరించారు. అనేక మంది రాజకీయ నాయకులకు జగన్ మోహన్ రెడ్డి ఆదర్శంగా నిలిస్తున్నారని నిఖిల్ కుమారస్వామి తెలిపారు.

జగన్ ఆదర్శం

జగన్ ఆదర్శం

నేటి రాజకీయ నాయకులతో పాటు యువతకు జగన్ ఆదర్శంగా నిలిచారని నిఖిల్ కుమారస్వామి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చెయ్యడానికి సిద్దం అయిన జగన్ నిఖిల్ కుమార్ వివరించారు. జగన్ ఎంతో ధైర్యంగా కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి నేడు సీఎం అయ్యారని నిఖిల్ కుమారస్వామి వివరించారు. జగన్ రాజకీయాల్లో మరింత ఎదగాలని ఇదే సందర్బంలో నిఖిల్ కుమారస్వామి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు

జగన్ సలహాలు

జగన్ సలహాలు

రాజకీయ రంగ ప్రవేశం చేసిన నువ్వు గెలుపు ఓటములు పట్టించుకోకుండా ప్రజా సేవ చెయ్యాలని, ప్రజలతో కలిసి తిరగాలి ఇదే సందర్బంలో జగన్ తనకు సూచించారని నిఖిల్ కుమారస్వామి ఫేస్ బుక్ లో వివరించారు. తనకు రాజకీయ భవిష్యత్తు ఎక్కువగా ఉందని, దానిని సద్వినియోజగం చేసుకోవాలని జగన్ ఆశీర్వదించారని నిఖిల్ కుమారస్వామి ఫేస్ బుక్ లో తెలిపారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామి తరువాత అనేక మంది రాజకీయ నాయకులతో భేటీ అయ్యి వారి సూచనలు సలహాలు తీసుకుంటున్నారు.

English summary
Karnataka Chief Minister H.D.Kumaraswamy son Nikhil Kumaraswamy met the Andhra Pradesh Chief Minister Jagan Mohan Reddy. Nikhil Kumaraswamy shared photo in Facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X