వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గదిలో బంధించి బాలికపై రేప్: హరికృష్ణ కోసం గాలింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ అత్యాచారం కేసులో కర్నూలు జిల్లాకు చెందిన సోమిశెట్టి హరికృష్ణ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతనిపై సికింద్రాబాదులోని మారేడుపల్లి పోలీసు స్టేషన్‌లో నిర్భయ కేసు నమోదైంది. తనను గదిలో బంధించి హరికృష్ణ అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

అత్యాచారానికి సంబంధించి బాధితురాలు ఈ నెల 11వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ బాలిక పోలీసు స్టేషన్‌కు కూడా వచ్చింది. ఆమెను పోలీసులు సికింద్రాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ముందు ఆమె తన వాంగ్మూలం ఇచ్చింది.

Nirbhaya case booked against Harikrishna

సోమిశెట్టి హరికృష్ణ కర్నూలు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడికి బంధువని, దాంతో కేసు మాఫీ కోసం ఒత్తిడి తెస్తున్నారని బాధితురాలు తన వాంగ్మూలంలో చెప్పింది. కర్నూలు జిల్లాలో కూడా పోలీసులు హరికృష్ణ కోసం గాలిస్తున్నారు.

నిందితుడిని పట్టుకోవడానికి రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బాధితురాలు మైనర్ బాలిక.

English summary
Nirbhaya case has been booked against Somisertti Harikrishna, belongs to Kurnool district at Maredupalli PS in secunderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X