కేంద్రంపై అవిశ్వాసం రాజకీయ డ్రామా, ఏ పార్టీలో ఉన్నానో అప్పుడే చెబుతా: అరకు ఎంపీ గీత
అమరావతి: కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఓ రాజకీయ డ్రామాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎంపీలు పార్లమెంట్లో హడావుడి చేస్తున్నారని చెప్పారు.
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముండగానే ఏపీలో రాజకీయ హడావుడి ప్రారంభమైంది, ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీలకు ఓట్లను తెచ్చి పెట్టే అస్త్రంగా మారింది.
ప్రత్యేక హోదాను మరోసారి రాజకీయ పార్టీలు ఏపీలో ప్రచారంగా మలుచుకొంటున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హమీలను కేంద్రం అమలు చేయడం లేదని విపక్షాలు బిజెపిపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
అవిశ్వాస తీర్మానం రాజకీయ డ్రామా
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఓ రాజకీయ డ్రామాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత అభిప్రాయపడ్డారు. రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే అవిశ్వాసాన్ని ముందుకు తెచ్చారని గీత ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెచ్చాయన్నారు. పార్లమెంట్లో ఎంపీలు హడావుడి చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
Recommended Video
రూ.3500 కోట్లు తీసుకొని బాబు ఏం చేశాడు
రూ.3500 కోట్లను కేంద్రం నుండి తీసుకొని ఏపీ రాజధాని విషయంలో ఒక్క ఇటుక కూడ పెట్టలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై అరకు ఎంపీ కొత్తపల్లి గీత విమర్శలు గుప్పించారు.నాలుగేళ్ళలో అరకు నియోజకవర్గ అభివృద్ది కోసం రూ.25 వేల కోట్లు తెచ్చినట్టు గీత చెప్పారు.
ఏ పార్టీలో ఉన్నానో ఆరు నెలల్లో చెబుతా
తాను ఏ పార్టీలో ఉన్నాననే విషయాన్ని ఎన్నికలకు ఆరు మాసాల ముందు ప్రకటించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థిగా గీత పోటీ చేసి విజయం సాధించారు. కానీ వైసీపీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఆమె ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు ఆమె టిడిపిలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. కానీ, ఆమె టిడిపికి కూడ దూరంగా ఉంటున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నాననే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించనున్నాని గీత చెప్పారు.
అలా అయితేనే మేమొస్తాం, టిడిపి, బిజెపి డ్రామాలాడితే బోడిగుండే: నారాయణ
జగన్ రోజుకో మాట, పూటకో తీర్మానం
విపక్ష నేత వైఎస్ జగన్ రోజుకో మాట, పూటకో తీర్మానం చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఆరోపించారు.చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించేందుకు జగన్ ప్లాన్ చేశాడని ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తన పలుకుబడి, బలంతో కేంద్రంపై అవిశ్వాసం పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
పెనం నుండి పొయ్యిలోకి, బిజెపి నేతలు కేంద్రాన్ని నిలదీయాలి: బాబు షాకింగ్ కామెంట్స్