వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‍‌కు నిరాశే: వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదన్న సీబీఐ కోర్టు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశే ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టులో నిరాశే ఎదురైంది. నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని జగన్ తరపు న్యాయవాది పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

No exemption for ys jagan attending to court: says CBI court

ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన సీబీఐ కోర్టు.. జగన్ అభ్యర్థనను తిరస్కరించింది. ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయింపు కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కాగా, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినాహాయింపు ఇవ్వవద్దని సీబీఐ వాదించింది.

కేసు విచారణలో ఉండగా ప్రధాన నిందితుడికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాలని జగన్ తరపు న్యాయవాదులు నిర్ణయించినట్లు తెలిసింది.

English summary
CBI court on Monday said that no exemption for YS Jaganmohan Reddy's personal attending to court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X