వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవినేని ఉమకు హైకోర్టులో దక్కని ఊరట-బెయిల్ విచారణ ఆగస్టు 3కు వాయిదా

|
Google Oneindia TeluguNews

కొండపల్లి అడవుల్లో గ్రావెల్ మైనింగ్ పరిశీలనకు వెళ్లి అరెస్టైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు ఇవాళ హైకోర్టులో ఊరట దక్కలేదు. తనపై నమోదైన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసుల్లో బెయిల్ కోరుతూ ఉమ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

బెయిల్ కోరుతూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇవాళ వాదనలు కూడా ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఉమను ఎలాగైనా రిమాండ్ లో ఉంచాలని భావించిన పోలీసులు.. స్టేషన్ రికార్డులను కోర్టుకు సమర్పించలేదు. దీంతో విచారణ వాయిదా వేయాలని కోర్టును వారు కోరారు. దీనిపై దేవినేని ఉమ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ నుంచి రికార్డులు వెంటనే తెప్పించాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

no immediate relief for former minister devineni uma as trial court postponed hearing on bail plea

తనపై నమోదైన కేసుల రికార్డులను వెంటనే స్టేషన్ నుంచి తెప్పించాలన్న దేవినేని ఉమ లాయర్ తరఫు అభ్యర్ధనను హైకోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే్ మంగళవారానికి అంటే ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు వారాంతపు సెలవులు ఉండటం, సోమవారం అప్పటికే విచారణకు స్వీకరించిన పిటిషన్లు ఉండటంతో మంగళవారం దేవినేని ఉమ బెయిల్ పై హైకోర్టు విచారణ జరపనుంది. అప్పటివరకూ దేవినేని ఉమకు జైల్లోనే ఉండక తప్పదు.

English summary
andhrapradesh high court on today adjourned hearing to august 3 on former minister devineni uma's bail plea in kondapalli forest case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X