విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ అమ్ముడుపోయారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు: కాంగ్రెస్‌తో దోస్తీపై గోరంట్ల

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయ పొత్తులు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సోమవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశంపై ఆయన స్పందించారు.

<strong>చంద్రబాబు ఏమన్నాడో చూడండి: అమితాబ్ బచ్చన్ ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్</strong>చంద్రబాబు ఏమన్నాడో చూడండి: అమితాబ్ బచ్చన్ ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ దిమ్మతిరిగే షాక్

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాడు జైలు నుంచి బయటకు వచ్చారన్నారు.

No permanent enemies or friends in politics, Gorantla

ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అఖిలపక్షాన్ని కూడగడుతోందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అమ్ముడుపోయి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వార్డు మెంబర్‌గా గెలవలేని జీవీఎల్ నర్సింహారావుకు టీడీపీని విమర్శించే అర్హత లేదన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ అప్రజాస్వామిక చర్యలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రం మొండి వైఖరితో ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పత్తిపాటి నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

English summary
No permanent enemies or friends in politics, says Telugudesam Party leader Gorantla Buchaiah Chowdary on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X