ఆ మాజీ మంత్రికి నో టికెట్..! బాబు సర్వేలో ప్రతికూల రిపోర్ట్ రావడమే కారణమా..??
అమరావతి/ హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వీటిలో ముఖ్యంగా 2014లో వచ్చిన ఫలితాలను 2019లో కూడా రిపీట్ చేయాలని అదికార పార్టీ క్రుతనిశ్చయంతో ఉంది. అందుకోసం ఎన్నో వ్యూహాలు సిద్ధం చేస్తోంది ఆ పార్టీ అధిష్ఠానం.
డేటా చోరీ: జార్జియాలో ఇలాగే జరిగింది.. ఓట్లు తొలగించి గెలిచారు! ఏపీలో ఇలా ఓట్లు తొలగింపు!!
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే, పార్టీని కూడా మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపుగుర్రాలను అణ్వేషించే క్రమంలో కొన్న కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో పక్కాగా ఉండాలని భావించిన చంద్రబాబు, ఇదివరకే అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నాలు చేయాలని ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. ఆ పనితీరు ఆధారంగానే టికెట్ ఇస్తామని కూడా చెప్పారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 40 మందికి టికెట్లు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే, సీఎం ఇప్పుడా నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. ఫైనల్ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలు మెరుగయ్యారని రిపోర్టులు వచ్చాయట. ఐనప్పటికి మాజీ మంత్రి పీతల సుజాత పరిస్థితి దారుణంగా ఉన్నట్టు నివేదికలు అందినట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన రహస్య సర్వేలో ఫలితాలు సుజాతకు ఏ మాత్రం ఆశాజనకంగా లేనట్టు తేలిందట. అందుకే ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక సుజాత రాజకీయ భవిత కాలమే నిర్ణయించాలి మరి..!