వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ భారతికి నాన్ బెయిలబుల్ వారెంట్: ఎందుకంటే..?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి సతీమణి భారతీరెడ్డికి, సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి కోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
కాల్మనీ కేసులో తనపై అసత్య వార్తలు రాశారంటూ కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు సాక్షి దినపత్రికపై నూజివీడు కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
కాగా, ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సాక్షి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అయిన భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తికి నాన్ బెయిలబుల్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. కాల్ మనీ కేసులో సాక్షి దినపత్రిక పలు కథనాలను ప్రచురితం చేసిన విషయం తెలిసిందే.
Comments
English summary
Krishna District Telugu Raithu President Chalasani Anjaneyulu filed a defamation case on Sakshi MD Bharathi and Chief Editor, Rama Chandra Murthy for airing false news on his involvement in the Call Money Case which shook the state back then.