వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు .. డీజీపీ గౌతమ్ సవాంగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలేశ్వర స్వామి నంది విగ్రహం కేసులో తనకు పోలీసులు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్న అచ్చెన్నాయుడు తనకు చట్టం, న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. ఈ రోజు ఈ కేసులో అందుకున్న నోటీసులకు కాశిబుగ్గ డీఎస్పీ ఎదుట హాజరైన అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు . భవిష్యత్తులో కూడా విచారణకు సహకరిస్తానని పేర్కొన్న అచ్చెన్నాయుడు తాను ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంటూ పేర్కొన్నారు.

ఆ దేవుడి దయతో అని చెప్తే సరిపోతుందా జగన్ .. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై లేదా : అచ్చెన్నాయుడు ధ్వజం ఆ దేవుడి దయతో అని చెప్తే సరిపోతుందా జగన్ .. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై లేదా : అచ్చెన్నాయుడు ధ్వజం

ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదన్న అచ్చెన్న

ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదన్న అచ్చెన్న

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పోలీసులు, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన ఆయన తనకు 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో కానీ, రిమాండ్ రిపోర్టులో కానీ తన పేరు లేదని స్పష్టం చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా విగ్రహాలను తొలగించిన వారిపై కేసులు పెట్టకుండా పోలీసులు ప్రవర్తిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డీఎస్పీ సమక్షంలో సీఐ గునపంతో పొడిచి విగ్రహాన్ని తొలగిస్తున్న వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్న ఆయన వాటిని హైకోర్టుకు అందజేస్తానని స్పష్టం చేశారు.

 డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటు

డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటు

తనతో పాటు చాలా మంది టీడీపీ నేతల పేర్లను ఈ కేసులో చేర్చారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు . రాష్ట్ర పోలీసు వ్యవస్థ అవహేళనకు గురవుతోంది అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. డిజిపి ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటని పేర్కొన్న అచ్చెన్న ఒక పౌరుడిగా పోలీసు వ్యవస్థ తీరు చూసి సిగ్గుపడుతున్నానని పేర్కొన్నారు. సీఎం ఏది చెబితే దానిని పోలీసులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ పదే పదే కోర్టు మెట్లు ఎక్కడం ఆయన పెట్టుకున్న స్టార్స్ కు, ఖాకీ డ్రెస్సుకు సిగ్గుచేటు అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు

ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు

ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతమ్ సవాంగ్ రాష్ట్రాన్ని ఎటు తీసుకు వెళ్తున్నారు అని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు గౌతమ్ సవాంగ్ పోలీసులను దద్దమ్మలుగా తయారు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దేశంలోనే ఏపీ పోలీస్ వ్యవస్థ అవహేళనకు గురవుతుందని పేర్కొన్న అచ్చెన్నాయుడు కావాలని నంది విగ్రహం తరలింపు విషయంలో తనపై దుష్ప్రచారం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై చంద్రబాబు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .

English summary
AP TDP state president Atchannaidu made harsh remarks on AP DGP Gautam Sawang. Atchannaidu who claimed that the police had issued him 41 notices in the Paleswara Swamy Nandi idol case, clarified that he had replied as he had respect for law and justice. Atchannaidu was incensed that the state police system was being ridiculed. Atchannaidu said that he was ashamed to look at the police system as a citizen the DGP going to court every time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X