హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మత్తులో అశ్లీలో నృత్యాలు: గెస్ట్‌హౌజ్‌లో హైద్రాబాద్, విజయవాడ యువతుల అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చేపల చెరువులకు యజమానిగా పేరున్న నిడమర్రు మూర్తి రాజు గెస్ట్ హౌస్‌పై పోలీసులు దాడి చేసి.. 8 మంది హైదరాబాద్ యువతులను అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చేపల చెరువులకు యజమానిగా పేరున్న నిడమర్రు మూర్తి రాజు గెస్ట్ హౌస్‌పై పోలీసులు దాడి చేసి.. 8 మంది హైదరాబాద్ యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూర్తి రాజు గెస్ట్ హౌస్‌లో ఆశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి.

ఈ మేరకు పోలీసులు దాడి చేయగా, తప్పతాగి అసభ్యకర నృత్యాలు చేస్తున్న 30 మంది యువతీ యువకులు అక్కడ కనిపించారు. దీంతో వీరందరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. వీరిలో హైదరాబాద్‌తో పాటు విజయవాడకు చెందిన అమ్మాయిలు ఉన్నారని, అందరినీ సోమవారం కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.

obscene dance: 8 girls arrested in West Godavari district

చేపల చెరువుల గెస్ట్ హౌస్‌లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై గత కొంతకాలంగా నిఘా పెట్టామని తెలిపారు. వీటి నిర్వాహకులు వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేస్తూ.. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తెప్పిస్తున్నారని చెప్పారు. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

English summary
8 girls allegedly arrested in West Godavari district due to obscene dance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X