వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లు: మంత్రాలయంలో కలకలం..

గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు చెత్తకుప్పలో రద్దయిన పెద్దనోట్లను గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

మంత్రాలయం: కేంద్రం రద్దు చేసిన పెద్దనోట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ఓ చెత్త కుప్పలో దర్శనమివ్వడం కలకలం రేపింది. పాత నోట్ల మార్పిడికి గడువు ముగిసిన 13రోజుల తర్వాత ఈ నోట్లు చెత్త కుప్పలో దర్శనమివ్వడం కర్నూలులో హాట్ టాపిక్ గా మారింది.

పోలీసుల కథన ప్రకారం.. మంత్రాలయం పుణ్యక్షేత్రంలోని బస్టాండ్ కు వెళ్లే రహదారిలో ఆర్&బి గెస్ట్ హౌజ్ పక్కన్నే ఓ చెత్త కుప్ప ఉంది. గురువారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులు ఈ నోట్లను గుర్తించారు. రోడ్లపై ఊడ్చిన చెత్తను చెత్తకుప్పపై పడవేస్తుండగా.. రద్దయిన పెద్దనోట్లు వారి కంటపడ్డాయి.

Old notes found in garbage dump mantralayam

విషయం ఆ నోటా.. ఈ నోటా.. పోలీసులకు తెలియడంతో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ అక్కడికి చేరుకున్నారు. రూ.12500 విలువ చేసే పాతనోట్లను పారవేసినట్టుగా గుర్తించారు. మంత్రాలయం వచ్చిన భక్తులెవరైనా ఈ చెల్లని నోట్లను ఇక్కడ పారేసుంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
The banned currency of Rs500 and Rs1000 were fount at garbage dump beside the road in mantralayam bus stop way
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X