రాపూరు పోలీస్స్టేషన్పై స్థానికుల దాడి: ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు
Recommended Video
నెల్లూరు: జిల్లాలోని రాపూరు పోలీస్స్టేషన్పై బుధవారం రాత్రి స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సై లక్ష్మణ్ రావు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
ఓ కేసు విచారణ విషయంలో యువకుడిని తీసుకువచ్చి కొట్టారన్న కోపంతో సదురు యువకుడి సంబంధీకులు ఈ దాడికి పాల్పడ్డారు. పోలీస్స్టేషన్లోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. మిగతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు.
Andhra: A group of locals attacked Rapur police station in Nellore dist earlier tonight&thrashed police jawans after they took a local into custody in a drink&drive case. 4 cops injured,including a Sub-Inspector&a constable who received head injuries. 4 people taken into custody. pic.twitter.com/ShNfXyrkz2
— ANI (@ANI) August 1, 2018
గాయపడిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంబాబు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం: ఐజీ గోపాలరావు
గాయపడిన ఎస్ఐ, కానిస్టేబుళ్లను ఐజీ గోపాలరావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులను గాయపర్చడం సరికాదని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సై పనితీరు బాగాలేదనడం అవాస్తవమని అన్నారు. రక్షణ కల్పించే పోలీసులపై దాడులు సరికాదని ఐజీ గోపాలరావు అన్నారు. దాడికి పాల్పడిన 50మందిలో 20మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.