ఖాళీ చెయ్యాలని చంద్రబాబు నివాసానికి నోటీసిచ్చిన అధికారులు .. ఏ క్షణంలో అయినా..
గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా కృష్ణా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉన్నట్లుగా అధికారిక అంచనా. ఈ క్రమంలో కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న నివాసాలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు ఇంటితో సహా మరో 36 ఇళ్లకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులిచ్చారు.
ఒక రాష్ట్రం ఒకే రాజధాని.. వైఎస్ జగన్ అమరావతిలో గడ్డి కూడా పీకలేడు : చంద్రబాబు, లోకేష్ ఫైర్
అధికారులు జారీ చేసిన నోటీసులలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ,కరకట్ట మీద ఇళ్ళను ఖాళీ చేయాలని పేర్కొన్నారు.
ఏ క్షణమైనా వరద ఇంట్లోకి రావచ్చని చంద్రబాబు ఇంటిని వరద నీరు ముంచెత్తే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనూ చంద్రబాబు ఇంటికి వరద నీరు పోటెత్తడంతో ఇంటిని ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా మరోమారు నోటీసు ఇచ్చారు
. ఎగువన విపరీతంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణానదిలో ఆరు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.