బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టు మృతదేహం లభ్యం
విశాఖపట్టణం: ఎఓబిలో ఎన్ కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా..ఈ ఘటనలో మరణించిన మావోయిస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తాజాగా బలిమెల రిజర్వాయర్ లో ఓ మృతదేహాం లభ్యమైంది. ఈ మృతేహాంతో చనిపోయిన మావోల సంఖ్య 31 కి చేరింది.
బలిమెలి రిజర్వాయర్ వద్ద చనిపోయిన మావోయిస్టు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.ఈ మృతదేహం బిబాసు నాయక్ గా గుర్తించారు.ఈ మృతదేహానికి సమీపంలోనే మరో రెండు మృతదేహాలు కూడ ఉన్నాయని స్థానికులు తెలిపారు.వీటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు .
ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు పారిపోయే క్రమంలో బుల్లెట్ల గాయాలతో బలిమెల రిజర్వాయర్ లో పడి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. రిజర్వాయర్ లో ఇంకా ఎవరైనా పడి చనిపోయి ఉంటారా అనే అనుమానాలు కూడ వ్యక్తంఅవుతున్నాయి.పోలీసు ఉన్నతాదికారులు కూడ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుండి మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి , చలపతిల సమాచారం మాత్రం రాలేదు.ఈ విషయమై రామకృష్ణ సతీమణి శిరీష హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై రామకృష్ణకు సంబందించిన సమాచారాన్ని హైకోర్టుకు తెలపాని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.