వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టు మృతదేహం లభ్యం

By Narsimha
|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం: ఎఓబిలో ఎన్ కౌంటర్ జరిగి వారం రోజులు దాటినా..ఈ ఘటనలో మరణించిన మావోయిస్టుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.తాజాగా బలిమెల రిజర్వాయర్ లో ఓ మృతదేహాం లభ్యమైంది. ఈ మృతేహాంతో చనిపోయిన మావోల సంఖ్య 31 కి చేరింది.

బలిమెలి రిజర్వాయర్ వద్ద చనిపోయిన మావోయిస్టు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.ఈ మృతదేహం బిబాసు నాయక్ గా గుర్తించారు.ఈ మృతదేహానికి సమీపంలోనే మరో రెండు మృతదేహాలు కూడ ఉన్నాయని స్థానికులు తెలిపారు.వీటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు .

one dead body found in balimela reservoir

ఎన్ కౌంటర్ లో పోలీసుల కాల్పుల్లో గాయపడిన మావోయిస్టులు పారిపోయే క్రమంలో బుల్లెట్ల గాయాలతో బలిమెల రిజర్వాయర్ లో పడి చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. రిజర్వాయర్ లో ఇంకా ఎవరైనా పడి చనిపోయి ఉంటారా అనే అనుమానాలు కూడ వ్యక్తంఅవుతున్నాయి.పోలీసు ఉన్నతాదికారులు కూడ ఇదే రకమైన అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం.

ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుండి మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి , చలపతిల సమాచారం మాత్రం రాలేదు.ఈ విషయమై రామకృష్ణ సతీమణి శిరీష హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయమై రామకృష్ణకు సంబందించిన సమాచారాన్ని హైకోర్టుకు తెలపాని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది.

English summary
one dead body found in balemela reservior . one week back an encounter at aob.maoists escape from police firing accidentally they slipdown in reservior.another 2 dead bodies found local people in reservior.one dead body identified bibasu naik .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X