మందుబాబులకు షాక్ .. ఏపీలో ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిల్స్ మాత్రమే ...కొత్త ఎక్సైజ్ పాలసీ
వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం పై దృషి సారించారు. అందుకే కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెస్తున్నారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరిగింది. అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని నిర్ణయించారు . ఇక సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహణ జరగనుంది.
ఆ జిల్లాలో ఓడినా టీడీపీదే హవా ... జగన్ ఆ నిర్ణయంతోనే వైసీపీ నేతలకు పెద్ద చిక్కు
సెప్టెంబర్ 1 నుండే కొత్త ఎక్సైజ్ పాలసీ ... పైలెట్ ప్రాజెక్టు కింద 474 మద్యం దుకాణాల ప్రారంభం అన్న మంత్రి నారాయణ స్వామి
సెప్టెంబరు 1 నుంచి పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకం ప్రారంభమవుతుందని ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్ మరియు వాణిజ్య పన్నులు) కె. నారాయణ స్వామి తెలిపారు. 474 దుకాణాలలో అమ్మకాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏ ప్రభుత్వ మద్యం దుకాణాలలోనూ పర్మిట్ గదులు ఇక ముందు ఉండబోవని ఆయన పేర్కొన్నారు. గురువారం ఎక్సైజ్ అధికారులు, జిల్లా యంత్రాంగాలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అక్రమ మద్యం అమ్మకాలపై శాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వైఎస్ఆర్సి ప్రభుత్వానికి చెందిన ‘నవరత్నాల్లో' మద్యం అమ్మకాలపై నిషేధం ఒకటి అని పేర్కొన్న నారాయణ స్వామి, నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. ఒక వ్యక్తి వద్ద ఉన్న అనుమతించదగిన సంఖ్యలో సీసాలను ఆరు నుండి మూడుకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
మద్యం షాపుల నిర్వహణ విషయంలో సమీక్ష .. పలు కీలక నిర్ణయాలు
స్పెషల్
చీఫ్
సెక్రటరీ
(ఎక్సైజ్,
రెవెన్యూ,
స్టాంపులు
మరియు
రిజిస్ట్రేషన్లు)
డి
సంబశివరావు
మాట్లాడుతూ
ఏ
దుకాణాలలోనూ
పర్మిట్
గదులు
ఏర్పాటు
చేయవద్దని
స్పష్టం
చేశారు.
ప్రభుత్వం
కొత్త
మద్యం
విధానం
అక్టోబర్
1
నుండి
అమలు
చేయబడుతుందని
దుకాణాలలో
మద్యపానం
వల్ల
కలిగే
నష్టాల
గురించి
హెచ్చరించే
బోర్డులను
ఏర్పాటు
చేయాలని
ఆయన
ఆదేశించారు.
కొత్త
విధానం
ప్రకారం,
ఆంధ్రప్రదేశ్
స్టేట్
బేవరేజెస్
కార్పొరేషన్
లిమిటెడ్
గత
సంవత్సరం
4,377
తో
పోలిస్తే
మొత్తం
3,500
దుకాణాలను
నడుపుతుంది.
ఎక్సైజ్
అండ్
ప్రొహిబిషన్
కమిషనర్
ఎం.ఎం.నాయక్
కొత్త
పాలసీని
రూపొందించడానికి
సంసిద్ధతను
వ్యక్తం
చేశారు
.
దీనికి
మౌలిక
సదుపాయాల
ఏర్పాటు
ప్రక్రియను
కూడా
ఆయన
సమీక్షించారు.
ఈ
సమావేశంలో
రాష్ట్ర
వ్యాప్తంగా
ఉన్న
జిల్లా
కలెక్టర్లు,
ఎక్సైజ్
మరియు
ప్రొహిబిషన్
అధికారులు
కూడా
పాల్గొన్నారు.
ఇక
ఈ
సమావేశంలో
తీసుకున్న
కీలక
నిర్ణయాలు
చూస్తే
దుకాణాలలో
తాగుడు
సౌకర్యం
లేదు..
అంటే
పర్మిట్
రూమ్స్
వుండవు.
ఒక
వ్యక్తి
వద్ద
ఉన్న
అనుమతించదగిన
సీసాల
సంఖ్య
ఆరు
నుండి
మూడుకు
తగ్గింది.
అంతే
కాక
సెప్టెంబర్
1
నుండి
కొత్త
మద్యం
విధానం
అమల్లోకి
వస్తుంది
బెల్టు షాపులపై ఉక్కుపాదం ..ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన జరగకుండా చర్యలు ..
ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవని ఎక్సైజ్ కమీషనర్ తెలిపారు .. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పి ఎపీలోని మద్యం ప్రియులకు షాక్ ఇచ్చారు .. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించే ఆలోచన కూడా ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు నిర్వహించకుండా ఉండేందుకే అన్న ఆలోచన ఉంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పిన ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామని చెప్పి నిదానంగా మద్యం షాపుల విధి విధానాలను మారుస్తూ సీఎం జగన్ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది జగన్ సర్కార్ .