వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం బేవకూఫ్, రజ్వీలాగా తరుముతాం: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు విరుచుకుపడుతున్నారు. పదవి కోల్పోయే స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఫైళ్లపై సంతకాలు పెడుతూ నిధులను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఓ బేవకూఫ్ అని, కాసిం రజ్విని తరిమినట్లు తరుముతామని రాజ్యసభసభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మనిషి రూపంలో ఉన్న దెయ్యమంటూ, సొమ్ముల కోసమే కుర్చీని పట్టుకుని వేలాడుతున్నాడంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పదవి కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా అడ్డగోలు గా ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిధులన్నీ చిత్తూరుకు తరలించుకుంటూ తెలంగాణకు మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు. సీఎం అవినీతి లెక్క లు విభజన తర్వాతైనా తేలుస్తామని హెచ్చరించారు. కిరణ్, చంద్రబాబు, జగన్‌లు రాష్ట్రాన్ని దోచుకున్న కాడికి దోచుకున్నారని, ఇంకా తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర లు చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కిరణ్ అక్రమాలపై ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి తాను కోర్టుకు వెళతానని మాజీమంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం ఎలాంటి అనుమతుల లేకుండానే రూ. 6వేల కోట్ల నాన్‌ప్లాన్ గ్రాంట్స్‌ను చిత్తూరు జిల్లాకు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ నెలలోనే టెండర్లను తెరవాల్సి ఉండటంతో సీఎం ఆ పనులు ఆమోదం పొందేవరకు ఉండి, మొబిలైజేషన్ అడ్వాన్సులు పొంది ఆ తర్వాత రాజీనామా చేయాలని చూస్తున్నాడన్నారు.

English summary
Congress Rajyasabha member Palwai Govardhan Reddy lashed out at CM Kiran kuamar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X