కూతురు వయస్సున్న వాలంటీర్తో పంచాయతీ కార్యదర్శి ప్రేమాయణం, రెండో పెళ్లికి సై...
అతను చేసేది బాధ్యత గల ఉద్యోగం. నలుగురికి మంచి చెప్పాల్సిన రెస్పాన్సిబులిటీ అతనిపై ఉంది. పెళ్లై.. వారు పెళ్లీడుకొచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ బుద్ది గడ్డి తిన్నది. తన కూతురు వయస్సున్న వాలంటీర్తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమె కూడా అతని మాయలో పడిపోయింది. ఇద్దరూ కలిసి.. సమాజాన్నే మరచిపోయి.. రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కట్ చేస్తే కేసులతో విషయం వెలుగులోకి వచ్చి.. పెళ్లి ఆగిపోయింది. యువతి కూడా పోలీసుల సంరక్షణలో ఉండటం ఇందులో ట్విస్ట్.
వీడు మాములోడు కాదు: ఇద్దరితో ప్రేమాయణం.. పెళ్లయ్యాక మాజీ ప్రియురాలితో జంప్!
ఏం జరిగిందంటే..?
గూంటూరు జిల్లా దాచేపల్లిలో ఆర్నెల్ల క్రితం సయ్యద్ జాన్ పీరా పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. అతనికి పెళ్లి కాగా.. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కుటుంబంతో కలిసి నారాయణపురంలో భార్య, పిల్లలతో కలిసి ఉండేవాడు. అయితే దాచేపల్లిలో ఓ మహిళా వాలంటీర్తో పరిచయం అయ్యింది. పరిచయం కాస్త రెండో పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. దాచేపల్లి పంచాయతీ నగర పంచాయతీగా అప్ గ్రేడ్ కాగా.. 3 నెలల క్రితం జాన్ పీరా దాచేపల్లి మండలం పొందుగుల కార్యదర్శిగా బదిలీ అయ్యాడు. కానీ వాలంటీర్తో ప్రేమాయణం మాత్రం కొనసాగుతూనే ఉంది.
రెండో పెళ్లికి సై..
జాన్ పీరా, వాలంటీర్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకొన్నారు. విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. 4 రోజుల క్రితం జాన్ పీరాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురుకి మత్తుమందు ఇచ్చాడని, అలా లోబరుచుకున్నాడని కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉంటే సీన్లోకి మహిళా వాలంటీర్ ఎంట్రీ ఇచ్చింది. తల్లిదండ్రులు తనను ఇబ్బంది పెడుతున్నారని 100కి ఫోన్ చేసి తెలిపింది. పేరంట్స్ నుంచి త్రెట్ ఉందని తెలుపడంతో పోలీసులు తమ సంరక్షణలోనే ఉంచుకున్నారు.
Recommended Video
పరారీలో జాన్ పీరా
యువతి పేరంట్స్ ఫిర్యాదు మేరకు జాన్ పీరాపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. పంచాయతీ సెక్రటరీ ప్రేమ వ్యవహారం జిల్లాలో చర్చకు దారితీసింది. అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.