వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్నారైతో ప్రేమ పెళ్లి: టెక్కీ కూతుర్ని చంపిన పేరెంట్స్!
కిరణ్ అనే ఎన్నారైని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె 21వ తేదీన ఈ వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఆమె ఈ రోజు విగత జీవిగా కనిపించింది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నదనే విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారని ఆమె భర్త కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుప్త నిధుల తవ్వకాలు
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముస్కాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.
హిమబిందు హత్యపై మహిళా సంఘాల నిరసన
విజయవాడలో దారుణ హత్యకు గురైన సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య అంశంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
English summary
Parents kill daughter for love marriage.