వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైతో ప్రేమ పెళ్లి: టెక్కీ కూతుర్ని చంపిన పేరెంట్స్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parents kill daughter for love marriage
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కూతురు ప్రేమ పెళ్లి చేసుకున్నదని తల్లిదండ్రులు పరువు హత్యకు పాల్పడ్డారు! గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి అనే మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఓ సాఫ్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న దీప్తి మూడు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

కిరణ్ అనే ఎన్నారైని ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె 21వ తేదీన ఈ వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఆమె ఈ రోజు విగత జీవిగా కనిపించింది. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నదనే విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారని ఆమె భర్త కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుప్త నిధుల తవ్వకాలు

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ముస్కాల్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

హిమబిందు హత్యపై మహిళా సంఘాల నిరసన

విజయవాడలో దారుణ హత్యకు గురైన సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ భార్య హిమబిందు హత్య అంశంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను నిర్భయ చట్టం కింద అరెస్టు చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Parents kill daughter for love marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X