గోరంట్లకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్..మేం గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్టులమైతే నువ్వు ఢిల్లీ లెవల్ రేపిస్ట్ ..
రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు వేడెక్కినట్లుగా కనిపిస్తున్నాయి . రాష్ట్రమంతా చలికి వణుకుతుంటే అనంతపురం జిల్లాలో మాత్రం వాతావరణం వేడెక్కింది . ఎంపీ గోరంట్ల మాధవ్ పరిటాల రవి పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. అప్పట్లో రాయల సీమలో పొలాలకు నీరు లేక, నెర్రెలు కొట్టి, పైరు చనిపోతుంటే, బీడు భూములుగా రాయలసీమ భూములు మారుతుంటే పరిటాల రవి నక్సలిజం, ఫ్యాక్షనిజం పేరుతో పొలాలలో ప్రజల రక్తపుటేరులు పారించారు అని హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లోనే దుమారంగా మారింది.
పరిటాల శ్రీరామ్ కు డబుల్ ప్రమోషన్ .. సంతోషంలో పరిటాల అనుచరులు !!
నీ కేసులు నువ్వు చూసుకో , పక్కన వాళ్ళ గోల నీకెందుకు
ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలపై పరిటాల కుటుంబం భగ్గుమంటోంది. ఇప్పటికే పరిటాల సునీత గోరంట్ల మాధవ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇక పరిటాల శ్రీరామ్ గోరంట్ల మాధవ్ పై మాటల తూటాలను సంధించారు. మేము గల్లీ లెవల్ ఫ్యాక్షనిస్టులమైతే, నువ్వు ఢిల్లీ లెవెల్ రేపిస్ట్ వి అంటూ ముందు నీ కేసులు నువ్వు చూసుకో , పక్కన వాళ్ళ గోల నీకెందుకు అంటూనే పరిటాల శ్రీరామ్ చురకలంటించారు. ఇక మీ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు ఎంపీ గారు, మీ రాజకీయ లబ్ది కోసం మా మీద ఫ్యాక్షనిస్టు ముద్రవేయడం సరైంది కాదు అంటూ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల రవీంద్ర గురించి మాట్లాడే స్థాయి నీది కాదు
పేద ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి పరిటాల రవి అని ఏదైనా మాట్లాడే ముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడండి అంటూ పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర గురించి మాట్లాడే స్థాయి నీది కాదని గోరంట్ల మాధవ్ చురకలంటించారు. నీ మీద ఉన్న రేప్, మర్డర్ కేసులు ముందు చూసుకుని, ఆ తర్వాత మాట్లాడు అంటూ గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు . నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ హెచ్చరించారు.
జగన్ మెప్పు కోసమే హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు
రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితులను బట్టి అప్పట్లో ఫ్యాక్షనిజం రాయలసీమలో ఉందని పేర్కొన్న పరిటాల శ్రీరామ్, పరిటాల రవి హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ప్రసన్నం చేసుకోవడం కోసం హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ కావాలని ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఒక యాక్షన్ కు కచ్చితంగా రియాక్షన్ ఉండి తీరుతుంది అని పేర్కొన్నారు.
రాప్తాడు నియోజక వర్గానికి నీరందించే ప్రాజెక్టుకు పరిటాల రవి పేరు తొలగించటం అన్యాయం
రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు కొత్త జలాశయాల నిర్మాణాన్ని స్వాగతించిన పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజక వర్గానికి నీరందించే ప్రాజెక్టుకు పరిటాల రవి పేరు తొలగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు అని మండిపడ్డారు. ఇదే సమయంలో రామగిరి మండలంలో పేరూరు జలాశయం నిర్మాణానికి వైయస్ఆర్సిపి ప్రభుత్వం ఎందుకు ముందుకు సాగడం లేదని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు.