అసెంబ్లీ క్యాంటీన్లో పరిటాల సునీత, పీతల: రుచి చూపించారు(పిక్చర్స్)
మంగళవారం ఉదయం ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే... మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు.
విజయవాడ: మంగళవారం ఉదయం ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే... మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ను పరిశీలించేందుకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత వచ్చారు.
మరింత బాగా చేస్తాం..
మహిళా మంత్రులు కిచెన్లోకి రాగానే పకోడీల ఘుమఘుమలు వారిని పలకరించాయి. ‘మేం మరింత బాగా వేస్తా'మంటూ ఇద్దరూ పిండి కలిపి, బాణలిలో పకోడీలు వేయించి, అందరికీ పంచారు. అనంతరం సచివాలయం ఉద్యోగులతో కలిసి భోజనం చేశారు.
సరదాగా కాసేపు..
కాసేపు సరదాగా మహిళా ఉద్యోగులతో మంత్రులు మాట్లాడారు. మంత్రులు రాకతో ఏపీ సచివాలయ క్యాంటిన్ సందడిగా మారింది. క్యాంటిన్ సిబ్బంది వంటల గురించి మంత్రులకు వివరించారు.
సిబ్బందితో..
సచివాలయ ఉద్యోగులు, సిబ్బందితో మాట్లాడుతున్న మహిళా మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.
విందు భోజనం
మహిళా మంత్రులు రాకతో ఏపీ సచివాలయ క్యాంటిన్ సందడిగా మారింది. క్యాంటిన్ సిబ్బంది వంటల గురించి మంత్రులకు వివరించారు. కాగా, మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలు సిబ్బందితో కలిసి భోజనం చేశారు.
సందడిగా..
మహిళా మంత్రులు క్యాంటీన్కు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. వంటల గురించి అడిగి తెసుకున్న మంత్రులు.. తమ పాక నైపుణ్యం చూపించారు. ఆ తర్వాత సిబ్బందితో కలిసి భోజనం చేశారు.
ఘనంగా మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలు కేక్ కట్ చేశారు. అనంతరం పరిటాల సునీత, పీతల సుజాతలు కేక్ ఒకరికొకరు తినిపించుకున్నారు.