మాకు విభేదాలున్నా: ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా రేణుకా చౌదరి, కేవీపీ
Recommended Video
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ఏపీ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం నిరసనలు కొనసాగించారు. హోదాపై ఏపీ ఎంపీలు, రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. లోకసభ వాయిదా పడిన అనంతరం టీడీపీ ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
లాబీలో హోదాపై బీజేపీ ట్విస్ట్, పాయింట్ లాగిన టీడీపీ: టీడీపీ మనసులో మాట అంటూ..
గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్ ఎంపీలు జత కలిశారు. రేణుకా చౌదరి, కేవీపీ రామచంద్ర రావు తదితరులు మద్దతుగా వచ్చారు.
రేణుకా చౌదరి మాట్లాడుతూ.. ఇది తెలుగు వారి ఆత్మగౌరవం అన్నారు. విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తే కేంద్రానికి బుద్ధి చెబుతామన్నారు. రాజకీయంగా ఎలాంటి విభేదాలు ఉన్నా సమస్యల పరిష్కారంలో మాత్రం కలిసి పోరాడుతామన్నారు. సమస్యల పరిష్కారంపై కేంద్రం కుంటిసాకులు చెబుతోందన్నారు.
Delhi: Telugu Desam Party (TDP) MPs stage protest near Mahatma Gandhi statue in Parliament demanding Special Category Status for #AndhraPradesh pic.twitter.com/9cmjCyLNYr
— ANI (@ANI) March 6, 2018
Delhi: Telugu Desam Party (TDP) MPs stage protest near Mahatma Gandhi statue in Parliament demanding Special Category Status for #AndhraPradesh pic.twitter.com/WLYYYRHUJ4
— ANI (@ANI) March 6, 2018
విభజన సమయంలో ఓటు వేసిన బీజేపీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పైకి నెడుతున్నారని మండిపడ్డారు. కేవీపీ రామచంద్ర రావు మాట్లాడుతూ.. ఏపీ సమస్యలపై తాను టీడీపీ కంటే ముందు నుంచి పోరాడుతున్నానని చెప్పారు.