చేరికలు: వైయస్ జగన్ పార్టీలోకి పార్థసారథి, వేదవ్యాస్
హైదరాబాద్: మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి పార్థసారథి, మాజీ డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పిన జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే మాజీ డిజిపి దినేష్ రెడ్డి, నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరారు. శుక్రవారం విజ్ఞాన్ రత్తయ్యతోపాటు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తన అనుచ రులతో కలిసి ర్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఆయన పార్టీలో చేరారు.
జగన్మోహన్ రెడ్డి వారిని పార్టీలోకి సాధారంగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా గంటా మురళీ రామకృష్ఱ మాట్లాడారు. సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జగన్మోహన్రెడ్డితోనే సీమాంధ్రలో అభివృద్ది జరుగుతుందని తెలిపారు.
గంటా మురళీ రామకృష్ఱకు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మంచి పట్టు వుండడంతో జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ బలపడే అవకాశాలున్నాయి. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణకు జిల్లాల్లో మంచి పట్టు వున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు కూడా వెల్లడించాయి.