వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి మీడియా ముందుకు పవన్ కల్యాణ్: ఏం చెప్తారోననే ఉత్కంఠ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరోసారి మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటే ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొనడం సహజం.

అత్యంత ముఖ్యమని భావిస్తే తప్ప ఆయన మీడియా ముందుకు రారు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది. బహుశా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Pawan Kalyan

ప్రభుత్వం తలపెట్టిన ఆక్వా మెగా పార్కు ప్రతిపాదనను భీమవరం రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై వారు ఇంతకు ముందు పవన్ కల్యాణ్‌కు మొరపెట్టుకున్నారు కూడా. జనసేన పార్టీ కూడా ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది.

పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడుతారా, లేదా అనేది కూడా ఆసక్తి కలిగించే విషయమే. భీమవరం రైతుల సమస్యపైనే కాకుండా ఆయన ఇతర విషయాలను తడుముతారా అనేది కూడా చూడాల్సి ఉంది.

English summary
Jana Sena chief Pawan Kalyan will address media today at 4pm on Bheemavaram farmers' issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X