'హోదాపై పవన్ కళ్యాణ్ చెప్పేదంతా అబద్దం', 'మోడీని కలవొచ్చు కదా'
ప్రత్యేక హోదా అంశం చచ్చిపోయిందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్పేది అంతా అబద్దమని రాయలసీమ పరిరక్షణ వేదిక అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
కర్నూలు/విజయవాడ: ప్రత్యేక హోదా అంశం చచ్చిపోయిందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్పేది అంతా అబద్దమని రాయలసీమ పరిరక్షణ వేదిక అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మంగళవారం నాడు ఆరోపించారు.
ఏం సంబంధం, నేనే పోరాడుతా, అదీ ఆయన విధానం.. పవన్ గురించి మాట్లాడనని: బాబు షాక్
రాయలసీమ సమస్యలను పరిష్కరించకుంటే మరో జల్లికట్టు ఉద్యమం ఉంటుందని బైరెడ్డి హెచ్చరించారు.
జగన్పై అచ్చెన్న ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన మంత్రి అయ్యన్న పాత్రుడు మంగళవారం నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై జగన్ కు అసలు అవగాహనే లేదని మండిపడ్డారు.
రాజకీయ నాయకుడు ఎవరైనా జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడి పెడతారా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం కోసం ఇక్కడ ధర్నాలు చేస్తే ప్రయోజనం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడవచ్చు కదా అని ప్రశ్నించారు. జనవరి 26న విశాఖ ఆర్కే బీచ్ లో యువత చేపడుతున్న నిరసనకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సరికాదన్నారు.