జగన్ కాన్వాయ్ కు సర్కార్ వాహనాల్లేవా ? ఉద్యోగుల సస్పెండ్ తో సరిపోతుందా ? పవన్ ప్రశ్నలు
ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం కాన్వాయ్ లో వాహనాలు లేక తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి ఇన్నోవా కారు లాక్కున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎంవో స్ధానిక ఆర్టీఏ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అయినా దీనిపై రాజకీయ దుమారం ఆగడం లేదు. ఒంగోలు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసారు.
ముఖ్యమంత్రి
ఒంగోలు
పర్యటనకు
ప్రభుత్వ
వాహనాలు
సమకూర్చలేని
పరిస్థితి
వచ్చిందా
అని
పవన్
కళ్యాణ్
ప్రశ్నించారు.
ఎవరి
ఒత్తిడితో
ప్రయాణికులను
దింపి
మరీ
వాహనం
తీసుకున్నారో
స్పష్టత
ఇవ్వాలని
పవన్
కోరారు.
ముఖ్యమంత్రి
జిల్లాల్లో
పర్యటిస్తే
ప్రయాణీకులను
నడిరోడ్డుపై
దింపేసి
వాహనాలు
స్వాధీనం
చేసుకొనే
పరిస్థితి
రాష్ట్రంలో
నెలకొనడం
విచిత్రంగా
ఉందని
ఆయన
అన్నారు.
ముఖ్యమంత్రి
పర్యటన
లాంటివి
ఉన్నప్పుడు
స్థానికంగా
ఉన్న
ట్రావెల్
ఆపరేటర్ల
నుంచి
వాహనాలు
అద్దెకు
తీసుకోవడం
గురించి
విన్నామే
తప్ప
ప్రయాణంలో
ఉన్నామని
చెబుతున్నా
పట్టించుకోకుండా
వాహనం
తీసుకొనే
పరిస్థితిని
ఎప్పుడూ
చూడలేదన్నారు.

బుధవారం
రాత్రి
ఒంగోలు
నగరంలో
శ్రీ
వేమల
శ్రీనివాస్
గారి
కుటుంబం
తిరుమల
వెళ్తుంటే
రవాణా
శాఖ
అధికారులు
బలవంతంగా
వారి
వాహనాన్ని
స్వాధీనం
చేసుకోవడం
విస్మయానికి
గురి
చేసింది
పవన్
తెలిపారు.
సీఎం
కాన్వాయ్
కోసం
ప్రయాణీకులను
నడిరోడ్డున
దింపేసి
వాహనాలు
స్వాధీనం
చేసుకోవల్సిన
పరిస్థితి
ఎందుకు
కలిగిందని
పవన్
ప్రశ్నించారు.
రూ.2.56
లక్షల
కోట్ల
బడ్జెట్
కలిగి,
రూ.7.77లక్షల
కోట్లు
అప్పు
తెచ్చుకొన్న
సామర్థ్యం
కలిగిన
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర
ప్రభుత్వం
ముఖ్యమంత్రి
పర్యటనకు
ప్రైవేట్
వ్యక్తుల
వాహనాలు
తీసుకోవడం
ఏమిటంటూ
పవన్
ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి
భద్రత
పర్యవేక్షించే
అధికారులు
కాన్వాయ్
లో
ప్రైవేట్
వాహనాలు
అనుమతిస్తున్నారా...
అనుమతిస్తే
ఏ
ప్రాతిపదికన
ఆ
వాహనాలు
తీసుకొంటున్నారో
వివరించాలన్నారు.
లక్షల
కోట్ల
బడ్జెట్,
అప్పులు
కలిగిన
ప్రభుత్వం
సొంతంగా
వాహనాలు
సమకూర్చుకోలేని
పరిస్థితిలో
ఉందా
అనే
సందేహాలు
నెలకొంటున్నాయన్నారు.
దీనిపై
ముఖ్యమంత్రి
కార్యాలయం
వివరణ
ఇవ్వాలని
పవన్
డిమాండ్
చేశారు.
ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగునపెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని పవన్ ఆరోపించారు. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలన్నారు. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది ముఖ్యమన్నారు. పాలన వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడి కావాలని పవన్ కోరారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. ఏటా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాహన శ్రేణిలో ఉండే వాహనాలు ఎన్ని? ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? ప్రైవేట్ వాహనాల్లో ఎవరు పర్యటనలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒంగోలు ఘటనపై శాఖపరమైన విచారణ చేయాలన్నారు.