ఫేస్బుక్లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ...జనసేన కోసం అధికారిక ఎఫ్ బి పేజ్ ప్రారంభం
Recommended Video
అమరావతి:పవన్ కల్యాణ్ ఫేస్బుక్లోకి ఎంటర్ అయ్యారు. తన పేరుతోనే అధికారికంగా ఫేస్బుక్ పేజీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. తన ఫేస్ బుక్ ఎంట్రీ గురించి పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు,కార్యక్రమాలను తెలిపేందుకే తాను ఈ ఫేస్బుక్ పేజీని ఏర్పాటు చేసినట్లు పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నవంబర్ 2న తాను రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ వెల్లడించారు. విజయవాడ నుంచి తుని వరకు ఈ రైలు యాత్ర చేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ కళ్యాణ్ రైలు యాత్రకి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణంలో రైలులోనే పలు వర్గాల ప్రజలతో పవన్కల్యాణ్ మాటామంతీ నిర్వహించనున్నారు. దీనితో పాటు తాను ఫేస్బుక్లో అందుబాటులో ఉన్నట్లు తన ట్విట్టర్ అకౌంట్లో సైతం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
అప్పుడు
కోహ్లీ
ఉన్నాడు,
బాధపడ్డాను:
జగన్కు
బాబు
విజ్ఞప్తి,
మోడీపై
తీవ్రవ్యాఖ్యలు
ఇదిలావుంటే జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ కు ఆయన మాతృమూర్తి అంంజనాదేవీ నాలుగు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఆమె ఈ మేరకు మంగళవారం చెక్కును పవన్ కళ్యాణ్ కు అందచేశారు. జన సేన పార్టీ ఆఫీస్ కు వచ్చి మరీ ఆమె పవన్ కు ఈ చెక్కును అందించారు. ఈ సందర్భంగా చాలా భావోద్వేగానికి గురైన పవన్ కళ్యాణ్ తన తల్లి కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అంటువంటివారి కుటుంబాలకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ కు చెప్పానన్నారు. తన భర్త వెంకట్రావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినందువల్ల తనకు పెన్షన్ వస్తోందని, ఆ పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్తో పాటు ఇతర జనసేన నేతల్ని పవన్ తన తల్లి అంజనీదేవికి పరిచయం చేశారు.