వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎసి గదుల్లో కూర్చుని ముఖానికి రంగు: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ నేత

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: తెలుగు చలన చిత్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన గురువారం వ్యాఖ్యానించారు.

అవినీతిపై ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. పరిపాలనను గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. కాకినాడలో ధర్నా కార్యక్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.

Pawan Kalyan is following Chandrababu: YCP leader

ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా కనిపించడం లేదని అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. ఎసి గదుల్లో కూర్చుని ముఖానికి రంగులు వేసుకుని పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజల్లోకి వస్తే సమస్యలు అర్థమవుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు పరిచేవరకు ప్రజలు చేపట్టే కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.

English summary
YS Jagan's YSR Congress party leader Dwarampudi Chandrasekhar Reddy lashed out at Jana Sena chief and Telugu film hero Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X