టాలీవుడ్ రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు: అంబటిపై దారుణంగా.. నవ్వులు!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన మళ్లీ సినిమాలు తీస్తారా? లేదా? అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఆయన అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు. సినిమాలు తీస్తూనే రాజకీయాల్లో కొనసాగాలని ఆశిస్తున్నారు.
చంద్రబాబు
కష్టం
పగోడికీ
రాకూడదు:
'ప్యాకేజీ
స్టార్'
అంటూ
పవన్పై
విజయసాయి
తీవ్ర
విమర్శలు
సినిమాలు చేసే అవకాశం..
అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం తాను పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతానని పలుమార్లు స్పష్టం చేశారు. తాను ఇక సినిమాలు చేసే అవకాశం దాదాపు లేదని ఆయన చెప్పుకొచ్చారు. సినిమాలు చేసుకుంటే డబ్బులు వస్తాయి కానీ.. ప్రజలకు ఏమైనా మేలు చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తాజాగా టాలీవుడ్ రీఎంట్రీపై..
తాజాగా, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, తనకు తెలిసింది ఒక్క సినిమానేనని ఆయన అన్నారు. అంతేగాక, తాను సినిమాల్లో చేస్తానో లేదో తెలియదు కానీ.. ప్రొడక్షన్ మాత్రం చేస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వారంతా వదిలేశారా?
ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి అవంతిపై విమర్శలు గుప్పించారు. అవంతి.. కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. అలాగే జగన్మోహన్ రెడ్డడికి జగతి పబ్లికేషన్స్, భారత సిమెంట్స్ లాంటి వ్యాపారాలున్నాయి కాదా..? అని నిలదీశారు.
అంబటిపై దారుణంగా పవన్ కళ్యాణ్..
ఇక వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన విమర్శలపైనా పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కూడా రెస్పాండ్ అవడమేంటండి బాబూ అని తన ప్రసంగాన్ని ముగించారు. దీంతో అక్కడున్న మీడియా ప్రతినిధులు గొల్లున నవ్వారు. రాజకీయాల్లో విఫలమైన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మళ్లీ మిమ్మల్ని తెరపైకి తీసుకొచ్చారనే వ్యాఖ్యలు చేశారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పవన్ కళ్యాణ్ ఈ మేరకు స్పందించారు. పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.