టార్గెట్ 2019: అనంతపురంలో జనసేన ఆఫీస్, టిడిపికి చెక్ పెట్టే ప్లాన్ ఇదే
అనంతపురం: 2019 ఎన్నికల కోసం జనసేన చీప్ పవన్ కళ్యాణ్ ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే పవన్ కళ్యాణ్ ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
పవన్ కళ్యాణ్తో పరిచయమే లేదు, చిరంజీవికి సలహ ఇచ్చా:పరిటాల రవి
పవన్కళ్యాణ్కు షాక్: ఓడించే శక్తి ఉంటే ఎవరు కాదన్నారు: కేంద్ర మంత్రి ఆశోక్ షాకింగ్
పవన్ దారెటు?: లెఫ్ట్తో జట్టు కట్టేనా, జనసేన ప్లాన్ ఇదే!
2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఇటీవలే ఏపీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విస్తృతంగా పర్యటించారు. అంతేకాదు అధికార పార్టీలపై విరుచుకుపడ్డారు.
టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్తో ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యలపై కూడ పార్టీ నాయకత్వం అధ్యయనం చేస్తోంది.
అనంతపురంలో జనసేన కార్యాలయం
అనంతపురంలో త్వరలోనే జనసేన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ అనంతపురంలో శంకుస్థాపన చేయనున్నారు. గుత్తి రోడ్డులోని రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు.
అనంతపురం నుండే పవన్ పోటీ
2019 ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అనంతపురం నుండి పోటీ చేయనున్నారు.ఈ మేరకు అనంతపురం జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని భావిస్తున్నందున తొలుత ఈ జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నాయత్వం చర్యలు మొదలు పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజా సమస్యలపై జనసేన పోరాటం
ప్రజా సమస్యలను తీసుకొని జనసేన పోరాటం చేయాలని నిర్ణయం తీసుకొంది. 2018 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల్లోకి వెళ్ళే యోచన చేస్తున్నారు. అంతేకాదు ఈ మేరకు తన చేతిలో ఉన్న సినిమాలను త్వరలో పూర్తి చేసి పూర్తి సమయాన్ని రాజకీయాల కోసం కేటాయించనున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇటీవలనే ప్రకటించారు.
అనంతపురంలో పవన్ పోటీతో టిడిపికి దెబ్బెనా
అనంతపురం జిల్లాలో టిడిపికి మొదటి నుండి బిసిలు అండగా నిలుస్తున్నారు. ఇదే జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బిసి ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడ లేకపోలేదు.. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకొనే నిర్ణయాల ఆధారంగా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. అయితే అదే సమయంలో బిసిలతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు జెసి సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి భావిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడే ఈ విషయాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు లేవంటున్నారు విశ్లేషకులు.