పవన్ కళ్యాణ్ 'ఆపరేషన్' ప్రారంభించారా? నాదెండ్ల మనోహర్తో భేటీకి ఇదీ కారణం!
అమరావతి: ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశంగా మారింది. జనసేనాని విజయవాడలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉన్న విషయం తెలిసిందే. పవన్, సీఎం చంద్రబాబులు శుక్రవారం దశావతార వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన విషయం తెలిసిందే.
Recommended Video
ఈ కార్యక్రమం అనంతరం శనివారం నాదెండ్ల మనోహర్ జనసేనానితో భేటీ అయ్యారు. అమరావతికి షిప్ట్ అయిన పవన్ కళ్యాణ్.. ఇక పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారని, అందులో భాగంగానే నాదెండ్లతో భేటీ అయ్యారని ప్రచారం జరిగింది. అంతే కాదు సీఎం చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ అయిన కమ్మ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
వారి భేటీ వెనుక కారణం ఇదీ
పవన్ కళ్యాణ్తో నాదెండ్ల మనోహార్తో పాటు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా భేటీ అయ్యారు. విజయవాడ పటమటలంకలోని పవన్ ఇంటికి వచ్చిన వారిరువురు దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. రాజధానిలో నూతనంగా నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైనందున కృతజ్ఞతలు తెలిపేందుకే పవన్ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని చెప్పారు. అలాగే ఆదివారం జరగనున్న స్వామివారి కల్యాణ మహోత్సావానికి రావాలని పవన్ను ఆహ్వానించారట.
వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు
జనసేన బూత్స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల ఆఖరు నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రజల్లో కొనసాగుతున్న భేదాభిప్రాయాలు, వైషమ్యాలను తొలగించడానికే ఈ ప్రయత్నమని చెప్పారు. పార్టీ రాజకీయ వ్యూహాకర్త దేవ్ బృందం, జనసేన తరఫున బొమ్మదేవర శ్రీధర్లు ఈ శిక్షణ తరగతులను పర్యవేక్షిస్తారని చెప్పారు.
వారి నేతృత్వంలో శిక్షణ తరగతులు వేరేవిదంగా అన్వయించడం సరికాదు
1977లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా మధ్యతరగతి మేధావులు పోరాడారని, మాతృభూమి కోసం వారి భాగస్వామ్యం అవసరమని, రాజకీయ వైరుధ్యాలను నేను విధానపరంగా చూస్తానే తప్ప వ్యక్తిగతంగా చూడనని, వైసీపీ, టీడీపీలలో ఈ అంశం లోపించడంతోనే అసెంబ్లీ సమావేశాలు సరిగా జరగడం లేదని, వైసీపీ, టీడీపీలలో నేను గౌరవించే నాయకులకు తనదొక విన్నపమని, ఏదైనా సందర్భంలో మీరు నన్ను కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా మీ పార్టీ నాయకుల యోగక్షేమాల గురించి వాకబు చేసిన దాన్ని వేరే విధంగా అన్వయించడం సరికాదన్నారు.
ఇక ఎక్కువగా అమరావతిలో!!
పవన్ కళ్యాణ్ విజయవాడలో అద్దె ఇల్లు తీసుకోవడం ద్వారా ఇక ఎక్కువగా ఏపీలోనే ఉంటానని జనసేనకు, ప్రజలకు చెప్పకనే చెప్పారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పవన్ ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజధానికి కుటుంబంతో సహా తరలి వెళ్లారు.