రైతు కన్నీరు పెడితే భూకంపం.. అసెంబ్లీలో బూతులు తప్ప మరోటి లేదు.. పవన్ కల్యాణ్ ఆగ్రహం
రైతు సమస్యలు, గిట్టుబాటు ధర ఇవ్వాలనే డిమాండ్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడలో గురువారం చేసిన రైతు సౌభాగ్య దీక్షను ముగించారు. రైతులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం విధానాలను తూర్పార పట్టారు. అసెంబ్లీ సమావేశాల తీరుపై పవన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన రైతు సౌభాగ్య దీక్షలో మాట్లాడుతూ..
రైతు కన్నీరు పెడితే భూకంపం
రైతు కన్నీరు భూమీ పడితే భూకంపం సృష్టిస్తుంది. రైతు కన్నీరు పెట్టుకుండా ప్రభుత్వం మనసుతో స్పందించాలి. ప్రతీది రాజకీయం చేయవద్దు. మీరు మంచివాళ్లైతే సూట్ కేసుల్లో ధాన్యం పంపిస్తారని పరోక్షంగా విమర్శలు చేశారు. నాకు రైతుల కష్టాలు తెలుసు. చిన్న మడిలోనే వ్యవసాయం చేస్తే.. రైతుల పడే కష్టం అర్ధమైంది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రైతులకు మెరుగైన వసతులు
పంటను ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేకపోవడం వల్లే తాము అప్పుల బారిన పడుతున్నాం. మా అప్పులు కారణం పండించిన పంటను రక్షించుకోలేకపోవడమే. ధాన్యం ఆరబెట్టేందుకు రైతులకు మెరుగైన వసతులను కల్పించాలి. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చించకుండా విలువైన సభా సమావేశాన్ని దుర్వినియోగం చేస్తూ తనను తిట్టమే పెట్టుకొన్నారు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మీ నాన్న మంచివాడైతే
మీ నాన్న వైఎస్ మంచివాడైతే.. ఆయన మీరు కూడా మారండి.. ఆయన పనిచేసిన విధంగా రైతుల కోసం పనిచేయండి. మీరు సరిగా వ్యవహరిస్తే మేము రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, పోరాటాలు చేయం. అంతేగానీ మాపై మీ నేతలతో తిట్టించడం వల్ల ప్రయోజనం ఉంది. బాగా పనిచేస్తే కొడాలి నానికి దండ వేస్తాం అని పవన్ కల్యాణ్ చురకలు అంటించారు.
అసెంబ్లీని హుందాగా నడిపించాలి
అసెంబ్లీని హుందాగా నడిపించాలి. ప్రస్తుత సమావేశాలు చూస్తే బూతులు తప్ప మరోకటి కనిపించడం లేదు. మీరు ఏ మీడియంను పెట్టుకొంటారో అదే పెట్టుకోండి. తెలుగు భాషను ఎలా రక్షించుకోవాలో మాకు తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల సమస్యలను పరిష్కరించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.