సీఎం జగన్ స్పందన కోసం వెయిటింగ్: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాషను కాపాడుకోవాలంటూ తన ఉద్యమాన్ని సాగిస్తున్నారు. మాతృ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 'మన్ కీ బాత్'లో చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో మాతృభాష ప్రాధాన్యంపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మిగితా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలని ఉందంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు చేశారు.
మన నుడి ,మన నది
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019
————————
మన దేశ ప్రధాని ,శ్రీ నరేంద్ర మోదీ గారు,అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం సందర్భాన ,మనకి బాత్ కార్యక్రమం లో ప్రస్తావించింది విని, శ్రీ జగన్ రెడ్డి గారు, మిగతా వైసీపీ సమూహం,ఎలా స్పందిస్తారో విందామని వేచిచూస్తున్నాను... pic.twitter.com/d8p7t6TgAp
మాతృభాష ప్రాధాన్యం, రాయలసీమ ముఠా సంస్కృతిపై కూడా పవన్ స్పందించారు. మాతృ భాషను కాపాడుకోవాలంటూ మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించి.. పలు పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్లను తన ట్వీట్లకు జతపర్చారు. అలాగే రాయలసీమలో ముఠా కక్ష్యలు, పాలెగాళ్ల సంస్కృతిపై పౌరహక్కుల సంస్త 1996లో ముద్రించిన పుస్తకాన్ని ట్విట్టర్లో పోస్టు చేశారు.
pawan kalyan-చిన్న ప్రశ్న: 'హిందూ దేవాలయాలే ఎందుకు పన్నులు కట్టాలి?'
'1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
'మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ' రాయల సీమ లోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసింది. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ' రాయల సీమ లోనే... కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని ,14 ఏళ్ల 'సుగాలి ప్రీతి ' ఉదంతమే దానికి ఉదాహరణ' అని పవన్ చెప్పుకొచ్చారు.