పురుషాంగం కొరికి హత్య: మెకానిక్ షెడ్డులోకి వెళ్లాక.. హిజ్రా దారుణం
ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సమీపంలోని వెల్ల గ్రామంలో ఓ హిజ్రా వన్నాల లక్ష్మణ్(34) అనే వ్యక్తి మర్మాంగాన్ని కొరికి హతమార్చింది.
లోకల్ ఫిలిమ్స్: అమ్మాయి అందంగా ఉండాలి.. అరుపులు బాగా వినపడాలి, ఇదో కొత్త వ్యసనం!
తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అసలు నిజం తెలిసింది. తొండంగి మండలం కృష్ణాపురంలోని బర్మా కాలనీకి చెందిన బృతి వీరవెంకట రమణ అలియాస్ వరసాల సోనీగా పిలిచే హిజ్రా ఈ హత్యకు పాల్పడినట్టు నిర్దారించారు.
పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబళ్ళ గ్రామానికి చెందిన వన్నాల లక్ష్మణ్ టాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య వదిలేయడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. ఇటీవల కామెర్ల వ్యాధి సోకడంతో పసరు వైద్యం కోసం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వెళ్లాడు.
అనంతరం తిరుగు ప్రయాణంలో అక్కడి బస్టాండులో ఓ హిజ్రా పరిచయమైంది. ఆపూ ఇద్దరూ కలిసి సమీపంలో ఉన్న ట్రాక్టర్ మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో హిజ్రా అతని మర్మాంగాన్ని కొరికి హతమార్చింది. హిజ్రాపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.